January 29, 2024
మొదటి సినిమా ఆర్ఎక్స్ 100తో దర్శకుడిగా తనెంటో నిరూపించుకున్న అజయ్ భూపతికి రెండో సినిమా మహాసముద్రం మాత్రం భారీ షాక్ ఇచ్చింది. శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దాంతో ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో మంగళవారం సినిమాను తెరకెక్కించారు. సినిమా రిజల్ట్ విషయంలో బిన్నాభిప్రాయాలు ఉన్నా..సినిమాటోగ్రఫి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు మిగిల్చింది.
తాజాగా ఈ సినిమా జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులు గెలుచుకోవడంతో మరోసారి అందరి దృష్టి ఆకర్షించింది.. ఉత్తమ నటి – పాయల్ రాజపుత్, ఉత్తమ సౌండ్ డిజైన్ – రాజా కృష్ణన్, ఉత్తమ ఎడిటింగ్ – గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ముదసర్ మొహమ్మద్ అవార్డులను గెలుచుకున్నారు.
మంగళవారం సినిమా థియేటర్లలోనే కాకుండా.. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలై.. అక్కడ కూడా మంచి ఆదరణను పొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాతలు కాగా.. పాయల్ రాజ్పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ వంటివారు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.
Read More: తమిళ హీరో సూర్య బాలీవుడ్ ఎంట్రీ..హీరోయిన్ గా జాన్వీ కపూర్