లైగర్ డబ్బింగ్ పూర్తి  చేసిన మైక్ టైసన్

April 2, 2022

లైగర్ డబ్బింగ్ పూర్తి  చేసిన మైక్ టైసన్
విజయ్ దేవరకొండతో  భారీ అంచనాలతో  రూపొందిన చిత్రం `లైగర్` (సాలా క్రాస్బ్రీడ్) షూటింగ్ పార్ట్ పూర్తయి  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ  లైగర్ సినిమాతో బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టాడు.

యుఎస్ఎ లో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే.  తాజాగా  మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.

మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషించాడు. అతనిపై చిత్రించిన సన్నివేశాలు చిత్రంలో ప్రధాన హైలైట్         లలో ఒకటిగా ఉంటాయి. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే. పెద్ద స్క్రీన్ లపై నిజమైన యాక్షన్ ని చూసేందుకు సినీ ప్రియులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.

పూరీ కనెక్ట్స్తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

థాయ్లాండ్ కు చెందిన కేచా స్టంట్ డైరెక్టర్ గా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ని నిర్వహిస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ట్రెండింగ్ వార్తలు