హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.. ఓం భీమ్ బుష్ సినిమాపై శ్రీ విష్ణు కామెంట్స్!

March 21, 2024

హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.. ఓం భీమ్ బుష్ సినిమాపై శ్రీ విష్ణు కామెంట్స్!

శ్రీ విష్ణు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక గత ఏడాది ఈయన సామజవరగమన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన త్వరలోనే ఓం భీమ్ బుష్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

శ్రీహర్ష దర్శకత్వంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి నటించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఇలా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీ విష్ణు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని తెలిపారు.

ఇప్పటివరకు ఎన్నో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని శ్రీ విష్ణు వెల్లడించారు. ఆడియెన్స్ హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీతో పాటు మిస్టరీ, థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు. ఈ కథ మా ముగ్గురి చుట్టూ తిరుగుతూ ఉంటుందని శ్రీ విష్ణు తెలిపారు.

ఓకే యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తే 10 సంవత్సరాల పాటు ఉండే మమ్మల్ని కాలేజీ నుంచి పంపించాలని భావిస్తుంటారు ఇలా యూనివర్సిటి నుంచి బయటకు వెళ్లినటువంటి మేము ఓ గ్రామానికి వెళ్తే అక్కడ ఎదురయ్యే పరిస్థితులు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా శ్రీ విష్ణు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: కొత్త షో ద్వారా రాబోతున్న రానా, రికార్డులు బద్దలు కావాల్సిందేనా?

ట్రెండింగ్ వార్తలు