కొడుకు పుట్టినరోజు 500 మందికి అన్నదానం చేసిన సురేఖ?

March 27, 2024

కొడుకు పుట్టినరోజు 500 మందికి అన్నదానం చేసిన సురేఖ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు గత మూడు రోజుల నుంచి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా సురేఖ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. గత కొద్దిరోజులుగా అపోలో హాస్పిటల్ లో ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పూజ కార్యక్రమాలలో భాగంగా ఉపాసనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన పూజా విశేషాలను ఎప్పటికప్పుడు ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేవారు.

ఇక రాంచరణ్ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణంలో సురేఖ ఈ పూజకు హాజరైనటువంటి భక్తులకు ఏకంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల ఉపాసన అత్తమ్మ కిచెన్స్ అంటూ సరికొత్త బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అత్తమ్మ కిచెన్స్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది.

ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు.ఇలా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా అత్తమ్మ కిచెన్స్ కూడా భారీ స్థాయిలో ప్రమోషన్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోని అత్తమ్మ కిచెన్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇలా అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పూజ కార్యక్రమాలలో సురేఖ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉపాసన రాంచరణ్ తమ కుమార్తెతో కలిసి తిరుమల చేరుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోనే ఈయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు చరణ్ కెరియర్ పరంగా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

Read More: సినిమాలలోకి రాకముందు చరణ్ ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా.. శాలరీ ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు