వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో అజిత్..

March 15, 2024

వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో అజిత్..

గత ఏడాది సంక్రాంతికి తమిళ స్టార్ హీరో అజిత్ తెగింపు అనే సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పుడు వచ్చింది.

హీరో విశాల్ తో మార్క్ ఆంటోనీ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అధిక రవిచంద్రన్ డైరెక్షన్లో అజిత్ ఈ సినిమా చేయబోతున్నారు. సినిమాకి గుడ్ బాడ్ అగ్లీ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు అప్పుడే ప్రకటించేశారు. అయితే తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అన్నది కన్ఫమ్ చేయలేదు.

ఒకవేళ తెలుగులో కూడా రిలీజ్ చేస్తే మాత్రం చిరంజీవి విశ్వంభర సినిమాకి అజిత్ పోటీ ఇస్తాడా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. గుడ్ బాడ్ ఆగ్లీ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. గతంలో 10 ఏళ్ల కిందట దేవిశ్రీప్రసాద్ సినిమాకి పనిచేశారు. 2014లో రిలీజ్ అయిన వీరం సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మంచి హిట్ ని అందించారు ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ..

అజిత్ కుమార్ సార్ తో కలిసి పని చేయటం గౌరవంగా భావిస్తున్నాను, దర్శకుడు అధిక రవిచంద్రన్ స్క్రిప్ట్, కథనం అద్భుతంగా ఉన్నాయి. అభిమానులను, సినిమా ప్రేమికులను ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. ఇక దర్శకుడు అధిక రవిచంద్రన్ మాట్లాడుతూ ఇది తన జీవితంలో అద్భుత క్షణం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి ఎడిటర్ గా విజయ్ వేలుకుట్టి, సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్ స్టంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

Read More: సైలెంట్ గా కూతురు పెళ్లి చేసిన వెంకీ మామ.. ఫోటోలు వైరల్?

ట్రెండింగ్ వార్తలు