డైరెక్టర్ కు రాఖీ కట్టి అన్నయ్యా అని పిలిచిన అనుపమ!

February 5, 2024

డైరెక్టర్ కు రాఖీ కట్టి అన్నయ్యా అని పిలిచిన అనుపమ!

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ అనుపమ, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఈగల్. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అనుపమ డైరెక్టర్ ను కార్తీక్ అన్నయ్య అంటూ మాట్లాడటంతో వెంటనే రవితేజ తనని ఆపారు.

అందమైన అమ్మాయిలు వాడుకూడని పదం అన్నయ్య ఈ పదం అసలు వాడకూడదు నువ్వు అన్నయ్య అని పిలవడంతో కార్తీక్ ఎన్నిసార్లు బాధపడి ఉంటాడు అంటూ తెలిపారు. నేను ఈ విషయం నీకెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటూ రవితేజ తెలిపారు.ఈ మాటలకు ఈమె మాట్లాడుతూ తనతో కలిసి నేను నాలుగు సినిమాలు చేశాను మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది అందుకే తనని అన్నయ్య అని పిలుస్తున్నాను అంటూ తెలిపారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అనుపమ వేదికపై మాట్లాడుతూ ఉండగా వెంటనే సుమ ఈ వీడియోని స్టేజ్ మీద ప్లే చేయడమే కాకుండా స్పెషల్ గా ఒక రాఖి తెప్పించి డైరెక్టర్ కార్తీక్ ను స్టేజ్ పైకి ఆహ్వానించి తన చేత డైరెక్టర్ కు రాఖీ కట్టించారు. ఈ బ్యాండ్ మీరు రాఖీ అనుకుంటారో ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుంటారో మీ ఇష్టం అంటూ సుమ చెప్పారు.

ఇక ఈ రాకి చేతిలోకి తీసుకున్నటువంటి అనుపమ పరమేశ్వరన్ నేను అన్నయ్య అని చాలా తక్కువ మందిని ఫీల్ అవుతూ ఉంటాను కానీ మీతో కలిసి నేను నాలుగు సినిమాలు చేసినప్పుడు మీ పట్ల నాకు అదే ఫీలింగ్ వచ్చింది అంటూ ఈమె తనని అన్నయ్య గానే భావించి తన చేతికి రాఖీ కట్టారు. ఇలా రాఖీ కట్టినటువంటి ఈమె అనంతరం వేదికపైనే డైరెక్టర్ కి హగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: కుమారి ఆంటీ మొదట్లో ఆ సింగర్ ఇంట్లో పని చేసేదా?

ట్రెండింగ్ వార్తలు