తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త హీరోయిన్లు.. ఎవరెవరంటే?

February 10, 2024

తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త హీరోయిన్లు.. ఎవరెవరంటే?

సినిమా ఇండస్ట్రీ కొత్త కొత్త హీరోయిన్లు ఇంటర్వ్యూతూనే ఉంటారు. తెలుగు హీరోయిన్లతో పాటు ఇతర భాషల హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగు సినిమాలలో తెలుగు హీరోయిన్లతో పోల్చుకుంటే ఇతర భాషల హీరోయిన్లు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొందరు ఇప్పటికే వేరే భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లి, తెలుగు తెరకు కొత్త తారగా పరిచయం కాబోతున్నారు. ఇంకొందరు వేరే భాషల్లో ఇప్పుడిప్పుడే పైకొస్తూ తెలుగుకి వస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలీవుడ్ దాదాపుగా పదిహేనేళ్లకు పైగా ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది దీపికా పదుకోన్.

కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్‌ కానుంది. అలాగే దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆఖరి లోపల విడుదల కానుంది. కాగా దేవర మూవీలో జాన్వీ కపూర్ పాత్ర పేరు తంగమ్. అంటే బంగారం అని అర్థం.

అలాగే రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యారని సమాచారం. అలాగే మరో హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాతో తెలుగుతలకు పరిచయం కాబోతోంది ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది. అలాగే మరో ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోర్సె. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెలుగు పరిచయం కాబోతోంది. రవితేజ టైటిల్ రోల్‌ చేస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు భాగ్య శ్రీ భోర్సె. అలాగే 2017లో మిస్‌ వరల్డ్‌గా నిలిచిన బాలీవుడ్‌ బ్యూటీ మానుషీ చిల్లర్‌ కూడా తెలుగు తెరపై కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఆపరేషన్‌ వాలెంటైన్‌ మానుషీకి తెలుగులో తొలి చిత్రం.

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు శక్తీ ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న రిలీజ్‌ కానుంది. ఇది వరుణ్‌ తేజ్‌కు హిందీలో తొలి చిత్రం కావడం విశేషం. అదేవిధంగా నాట్య కళాకారిణి ప్రీతీ ముకుందన్‌ కన్నప్ప సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ బ్యూటీ ఇవానా కూడా ఆశిష్ హీరోగా నటిస్తున్న సెల్ఫీస్ సినిమాతో తెలుగు పరిచయం కాబోతోంది. హీరోయిన్ శ్రీదేవి శెట్టి కూడా తెలుసు కదా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. నటుడు జానీ లీవర్‌ కుమార్తె జెమీ లీవర్‌ హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతోంది. ఆ ఒక్కటీ అడక్కు అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. రామ్‌ అంకం దర్శకత్వంలో రాజీవ్‌ చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read More: తల్లి కాబోతున్న హీరోయిన్ రీచా చద్దా.. నెట్టింట పోస్ట్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు