January 12, 2024
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించినటువంటి చిత్రం కెప్టెన్ మిల్లర్. ప్రియాంకా మోహన్, శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ హీరోలు నటించి ఈ సినిమా నేడు తమిళ భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలైంది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు ఈ రోజే రావాల్సి ఉండగా ఇప్పటికే సంక్రాంతి బరిలో తెలుగు సినిమాల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా తెలుగు విడుదల వాయిదా పడింది. 1930ల బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది.
ఇక ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఏసియన్ వారు విడుదల చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా తెలుగు విడుదల తేదీని అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమా తెలుగులో రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి 25వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమాకు భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.
ధనుష్ కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ ఈయనకి తెలుగులో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయనకి కూడా తెలుగులో ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల వాయిదా వేశారు. మరి రిపబ్లిక్ డే సందర్భంగా రాబోతున్నటువంటి కెప్టెన్ మిల్లర్ ప్రేక్షకులను ఎలా ఆకట్టు కుంటుందో తెలియాల్సి ఉంది.
ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ తో కలిపి ఏషియన్ వారు కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. మరి కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టిస్తున్నటువంటి కెప్టెన్ మిల్లర్ తెలుగులో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
Read More: త్రివిక్రమ్ మధ్యలోనే వెళ్లి బ్రతికిపోయాడు… ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !