July 3, 2022
కోలీవుడ్ పాపులర్ హీరో ధనుష్ కొత్త చిత్రం ఖరారైంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళంలో ‘రాకీ’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి సినిమాను తీసి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న అర్జున్ మాథేశ్వరన్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
1930– 1940 కాలం బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుంది. సో…‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంకోసం ధనుష్ దాదాపు 80 సంవత్సరాలు వెనక్కి వెళ్తోన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ధనుష్ బందిపోటు తరహా గెటప్లో కనిపిస్తున్నాడు. ముఖం కనిపించకుండా ఏదో కట్టుకున్నాడు. భుజానికి తుపాకిని తగిలించుకుని బుల్లెట్పై దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం ధనుష్ ‘వాతి’ (తెలుగులో ‘సర్’) అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే థనుష్ నటించిన మరో రెండు చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి.