January 27, 2024
రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించారు. 17 మందికి ప్రముఖులకు పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. సినీరంగానికి చేసిన సేవకుగాను మెగాస్టార్ చిరంజీవిగారికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలపడం కోసం టాలీవుడ్ నిర్మాత అలాగే తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి కలవడం జరిగింది.
అయితే తాను కలిసిన అనంతరం ఆయనకు ఈ అవార్డు రావడం చాలా ఆనందం కలిగించింది అని అయితే ఈ శుభ సందర్భంలో ఒక స్పెషల్ ఈవెంట్ ని తాము ప్లాన్ చేయాలని చూస్తున్నామని మిగతా వివరాలు త్వరలోనే అందిస్తామని దిల్ రాజు తెలిపారు. దీనితో మెగాస్టార్ కి దక్కిన ఈ అరుదైన గౌరవానికి తెలుగు సినిమా తరపున ఒక గ్రాండ్ ట్రీట్ త్వరలోనే ఉండబోతుంది అని తెలుస్తోంది. మరి ఈ ఈవెంట్ ను ఏప్పుడు..? ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
Read More: విజయ్ నా కళ్లముందు పెరిగాడు..టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు – రజినీకాంత్