హీరోగానందమూరి వారసుడు ఎంట్రీ.. మోక్షజ్ఞ కంటే ముందే వచ్చేస్తున్నాడుగా?

March 26, 2024

హీరోగానందమూరి వారసుడు ఎంట్రీ.. మోక్షజ్ఞ కంటే ముందే వచ్చేస్తున్నాడుగా?

నందమూరి వారసులుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఈ ఇద్దరి హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గత 7, 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి తప్ప ఇప్పటివరకు ఈయన సినీ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చింది మాత్రం లేదు. కానీ మోక్షజ్ఞ కంటే మరో వారసుడు ముందుగానే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

నందమూరి ఫ్యామిలీకి ఎంతో ఆప్తుడు అయినటువంటి డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని సమాచారం. మరి ఆ వారసుడు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.. దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు దివంగత జానకిరామ్ గురించి మనకు తెలిసిందే. వీరిద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.

జానకిరామ్ కి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇందులో పెద్దబ్బాయి నందమూరి తారక రామారావు ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే సినిమాతో పాటు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా నటించారు. ఇలా బాల నటుడిగా నటించినటువంటి తారక రామారావు త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నారని వైవిఎస్ చౌదరి తనని ఒక ప్రేమ కథ సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారని సమాచారం.

ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించబోతున్నారని తెలుస్తుంది. ఇలా మోక్షజ్ఞ కంటే జానకిరామ్ కుమారుడు నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలోకి రాబోతున్నారనే విషయం తెలిసి బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఎప్పుడు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Read More: విరూపాక్ష సినిమాలో నేనే హీరో..కానీ అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టిన అర్జున్ అంబటి?

ట్రెండింగ్ వార్తలు