January 5, 2024
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి సినిమాలపై ఎన్నో అంచనాలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ మహేష్ కాంబోలో గుంటూరు కారం ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో చిత్ర బృందానికి షాక్ ఇస్తూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా స్టోరీ ఒరిజినల్ కాదని ఇది కూడా కాపీ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.
గుంటూరు కారం సినిమా ఒరిజినల్ స్టోరీ కాదని ఇది యుద్దనపూడి సులోచనారాణి రాసినటువంటి కీర్తి కిరీటాలు అనే ఒక నవల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్త వైరల్ గా మారింది. ఇలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా కాఫీ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై చిత్ర బృందం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ఎంతో మంది వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అదేంటి బ్రో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాపీయేను అలాగే సినిమా డైరెక్టర్ కూడా కాపీయేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మన గురూజీ గురించి అందరికీ తెలిసిందే కదా ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటూ మరి కొందరు త్రివిక్రమ్ గురించి కూడా కామెంట్లు చేస్తూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
According to reliable sources, Trivikram is alleged to have copied from Yaddanapudi's novel '#KeertiKireetalu' for the storyline of '#GunturKaaram.'
— greatandhra (@greatandhranews) January 5, 2024
Read @greatandhranews Story | https://t.co/kO6MDi46AE#Trivikram #MaheshBabu
Read More: గుంటూరు కారం సెన్సార్ రివ్యూ.. పక్కా పండుగ సినిమా