ఆ కారణంతోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. ఓపెన్ అయిన వరుణ్!

February 19, 2024

ఆ కారణంతోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. ఓపెన్ అయిన వరుణ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో వీరు తమ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా పెద్దలను ఒప్పించి వీరిద్దరూ ఇండియాలో కాకుండా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో చాలామంది వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తమ పెళ్లి ఇటలీలోనే జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాలను వెల్లడించారు. వరుణ్ తేజ్ నటించినటువంటి ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయనకు తమ పెళ్ళి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

తమ పెళ్లి ఇటలీలో చేసుకోవడానికి కారణం లేకపోలేదని తెలిపారు. ఇండియాలో కనుక తమ పెళ్లి జరిగి ఉంటే ఎంతోమంది గెస్ట్లు వచ్చేవారు వారందరినీ రిసీవ్ చేసుకోవడంలోనే అమ్మానాన్న ఉండేవారని తమ పెళ్లిని వాళ్ళు కల్లారా చూడలేరని తమ పెళ్లిని ఎంజాయ్ చేసేవారు కాదు అంటూ వరుణ్ తెలిపారు. తమ పెళ్లిని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని ఇది మా ఫ్యామిలీ వెకేషన్ లాగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇటలీలో ప్లాన్ చేశామని తెలిపారు.

పెళ్లిళ్లలో ఎంజాయ్ చేయాలన్న ప్రశాంతంగా పెళ్లి జరగాలన్న ఎంత తక్కువ మంది పెళ్ళికి హాజరయితే అంత ప్రశాంతంగా ఉంటుంది అందుకే తమ పెళ్లిని ఇటలీలో ప్లాన్ చేసుకున్నామని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తమ పెళ్లి ఇటలీలోనే జరగడం వెనుక ఉన్నటువంటి కారణాన్ని వెల్లడించారు. ఇక పెళ్లి తర్వాత వరస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు లావణ్య కూడా సినిమాలలో నటిస్తూ బిజీ కానున్నారు.

Read More: కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. దారుణంగా ఉందంటూ?

ట్రెండింగ్ వార్తలు