July 21, 2023
‘హిరణ్యకశ్యప’ అనేది హీరో రానాకే కాదు..దర్శకుడు గుణశేఖర్కి కూడా డ్రీమ్ ప్రాజెక్ట్. దీంతో ‘హిరణ్యకశ్యప’ కోసం రానా, గుణశేఖర్ ఏకమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను ఎప్పుడో స్టార్ట్ చేశాడు గుణశేఖర్.
పనిలో పనిగా 2019లో రానాతో తాను హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ను చేస్తున్నానని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైయ్యాయని అధికారికంగా సోషల్మీడియాలో ప్రకటించారు గుణశేఖర్.
అప్పట్నుంచి ‘హిరణ్యకశ్యప’కు దర్శకుడు గుణశేఖర్నే అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రజెంట్ అమెరికాలో జరుగుతున్న కామిక్ కాన్–2023 సెలబ్రేషన్స్లో ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కథ అందిస్తున్నట్లుగా ప్రకటించారు రానా.
అమర్ చిత్ర కథల అధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించారు.తన నిర్వాణసంస్థ స్పిరిట్ మీడియాపై రానా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఇండస్ట్రీ కొత్త వివాదానికి తెరలేచింది. ఇటు గుణశేఖర్ కూడా షాక్ అయ్యారు. అయితే ‘హిరణ్య కశ్యప’పై తాను ఎంతో కాలంగా వర్క్ చేస్తున్నానని, ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎవరైనా కలుగజేసుకుంటే ఊరుకునేది లేదని గుణ శేఖర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.
‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగిన సందర్భాన్ని పరోక్షంగా ఉదహారిస్తూ గుణశేఖర్ ఇలా అన్నారు.
అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ చేజారిపోతున్న తరుణంలో గుణశేఖర్ సహనం నశించింది.‘మీ సినిమాలోని కథకు ప్రధానాంశము దేవుడే అయినప్పుడు…మీరు గుర్తుంచుకోవాల్సిన విషయంఒకటి ఉంది.
మీ నిజాయితీని ఆ దేవుడు కూడా గమనిస్తుంటాడు. అనైతిక చర్యలకు నైతికచర్యలేపర్యవసానంగా తిరిగొస్తాయి’’ అంటూ గుణశేఖర్ ట్వీట్ చేశారు.
దీంతో గుణశేఖర్ చేసిన ఈ ట్వీట్ ‘హిరణ్యకశ్యప’ గురించే అని అర్థం అవుతుంది. అంతా..ఒకే కానీ ‘హిరణ్యకశ్యప’ సినిమాకు త్రివిక్రమ్ కథ అందిస్తే, దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నమోస్ట్ వాంటెడ్ క్వశ్చన్.
మరి.. ‘హిరణ్యకశ్యప’ వివాదం ఎన్నిమలుపులు తిరిగి ఎక్కడ ముగుస్తుందో, అసలు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, ఫైనల్గా ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
Read More: విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి