గుంటూరు కారం అందుకే పోయింది.. ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్ వైరల్!

February 5, 2024

గుంటూరు కారం అందుకే పోయింది.. ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్ వైరల్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ప్రేక్షకులు ఆశించినటువంటి ఫలితాలను అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ పట్ల భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫలితం గురించి ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎస్వీ కృష్ణారెడ్డి చిన్న హీరోలతో కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు కానీ నాగార్జున బాలకృష్ణ లాంటి హీరోలతో చేసిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

ఇలా స్టార్ హీరోల ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సినిమా చేశానో ఆ క్షణం నా సినిమాలో ఫ్లాప్ అయ్యాయని ఈయన తెలిపారు. సినిమాని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టకూడదు కేవలం కథని నమ్ముకొని సినిమా చేయాలని హీరోలను నమ్ముకొని సినిమాలు చేయకూడదు అంటూ కృష్ణారెడ్డి తెలిపారు.

తన విషయంలో ఇదే జరిగిందని ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో అద్భుతమైనటువంటి హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ అని చెప్పాలి అలాంటి ఆయన మహేష్ బాబుతో సినిమా అంటేనే ఆయన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఏదో చేయాలని ఆరాటపడుతూ మరేదో చేశారని అందుకే ఈ సినిమా ఇలాంటి ఫలితం అందుకుంది అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: డైరెక్టర్ కు రాఖీ కట్టి అన్నయ్యా అని పిలిచిన అనుపమ!

ట్రెండింగ్ వార్తలు