అందరూ నన్ను ఎక్కడెక్కడో చూస్తారు!.. జాన్వీ కపూర్ మహా చిలిపి

January 6, 2024

అందరూ నన్ను ఎక్కడెక్కడో చూస్తారు!.. జాన్వీ కపూర్ మహా చిలిపి

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీదేవి వారసురాలిగా ధడక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటించారు. అయితే ఈమె మొదటిసారి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సినిమాల పరంగా ఈమె బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఇటీవల కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సెలబ్రిటీలను వింత వింత ప్రశ్నలు వేస్తూ వారిని ఇబ్బంది పెడుతుంటారు. అదేవిధంగా నటి జాన్వీను కూడా ప్రశ్నిస్తూ అబ్బాయిలను చూడగానే జాన్వీ ఏమీ నోటీసు చేస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. వారిలో నేను ఏం నోటీస్ చేస్తాను అనడం దానికంటే వారందరూ కూడా నన్ను ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు అంటూ ఈమె చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇక ఈమె ఏదైనా పార్టీలకు వెళ్లిన పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ పెద్ద ఎత్తున అందాలన్నింటిని ఆరబోస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో అబ్బాయిలు తన వైపు ఎక్కడెక్కడో చూస్తారు అంటూ పరోక్షంగా ఈమె కామెంట్ చేయడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ జాన్వీ మహా చిలిపి ఈమె స్ట్రెంత్ గురించి తనకు తెలుసు అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: అర్జున్ రెడ్డి అల్లు అర్జున్ తో చేయాల్సి ఉండేదా.. చేసి ఉంటే మరోలా ఉండేదే?

ట్రెండింగ్ వార్తలు