February 8, 2024
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ భారీ తారాగణంతో రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీనిపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ ఖాయమయ్యారని గతంలోనే వార్తలు వచ్చాయి. సీతగా పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే సీత పాత్ర కోసం మొదట అలియాభట్కు లుక్ టెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత సాయి పల్లవిని ఎంపిక చేశారని టాక్ వినిపించింది. సీతగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్ నటించబోతున్నట్లు ఒక ఫోటోను కూడా ఎడిట్ చేసి పెట్టిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇప్పుడు సీత క్యారెక్టర్ కి మరొక పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ నితేశ్ తివారీ ఆఫీస్ వద్ద తాజాగా జాన్వీ కనిపించడంతో ఈ ప్రచారం జోరందుకుంది. లుక్ టెస్ట్ కోసమే ఆమె అక్కడికి వెళ్లినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
సీత పాత్రలో ముందుగా అనుకున్న సాయి పల్లవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నితేశ్ దర్శకత్వంలో జాన్వీ బవాల్ లో నటించారు. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోసారి ఆమెకు అవకాశమివ్వాలని నితేశ్ భావిస్తున్నారని, ఈ సినిమాలో రావణుడిగా యశ్ విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా బాబీ దేవోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి అని,త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీని మూడు భాగాల్లో తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. దీని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ల కోసం నితేశ్ తివారీ టీమ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్ఈజీ తో కూడా సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్ టెస్ట్ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ను అల్లు అరవింద్ మరికొంతమంది బాలీవుడ్ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు.
Read More: అనుష్క చేసిన ఆ తప్పే కెరీర్ కు మైనస్ అయిందా?