September 2, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన `ఖుషి` మొదటి రోజు వసూళ్లు మొత్తం సినీ పరిశ్రమని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్లు షో బై షో పెరుగుతూ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అని మైత్రి మూవీ మేకర్స్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మొదటి రోజు తెలంగాణ, ఏపీలో కేవలం 60% మాత్రమే ఆక్యూపెన్సీ నమోదైంది. ఓవర్సిస్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఓకేగా ఉన్నాయి. అయితే మరో అడుగు ముందుకేసి అక్కడ కూడా ఈ సినిమా 800 మార్కును దాటినట్లుగా ఖుషి టీమ్ తెలిపింది.
ఒక సారి ఒరిజనల్ కలెక్షన్లను పరిశీలిస్తే..ఈ సినిమా మొదటి రోజు 10పదికోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది అని సమాచారం. అంటే 15కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇక రెస్టాఫ్ ఇండియా ఒక కోటి వరకూ వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా కలిపిన మొదటిరోజు 17కోట్లకు పైన ఒక్క రూపాయి కూడా వసూలు చేసే అవకాశం లేదు. కాని ఫేక్ కలెక్షన్లకు మారుపేరైన మైత్రి మూవీ మేకర్స్ తమ వాటాగా దాదాపు 13 కోట్ల రూపాయలు కలిపి ప్రపంచవ్యాప్తంగా 30.1కోట్లు అని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లెక్కలు చూసిన డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ కి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాని పరిస్థితి.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో నష్టపోయిన బయ్యర్లు ఈ సినిమాతోనైనా లాభాల బాట పడుతాం అనుకుంటే లేని కలెక్షన్లు చూపించి అందరినోరు మూయిస్తున్నారు. ఖుషి సినిమా మీద మైత్రి వాళ్లు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే…మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు.
Read More: ఖుషి మూవీ రివ్యూ