September 5, 2022
సుధీర్బాబు, కృతీ శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్బాబు సమర్పణలో మైత్రీమూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించిన ఈ చిత్రం 2022, సెప్టెంబరు 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో మహేశ్బాబు సోషల్మీడియాలో షేర్ చేసి, చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ చిత్రంలో డాక్టర అలేఖ్య పాత్రలో కృతీశెట్టి, దర్శకుడి పాత్రలో సుధీర్బాబు నటించారు. సినిమా ప్రపంచం అంటే ఇష్టం ఉండని ఫ్యామిలీలో జన్మించిన అలేఖ్య ఫైనల్గా యాక్టర్గా ఎలా మారింది? అన్నదే సినిమా కథాశం. ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్బాబుల కాంబినేషన్లో వస్తున్న ఈసినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
Happy to launch the trailer of #AaAmmayiGurinchiMeekuCheppali…looks like an interesting one! All the best to @isudheerbabu @IamKrithiShetty, #MohanaKrishnaIndraganti and the entire team!https://t.co/fGU4r3CraX@MythriOfficial @benchmarkstudi5
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2022