February 3, 2022
Mahesh-Trivikram: అతడు, ఖలేజ తర్వాత అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహేష్-త్రివిక్రమ్ సినిమా ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు ప్రారంభమైంది. హీరోయిన్ పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మహేష్ బాబు సతీమణి నమ్రత క్లాప్ నివ్వగా ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. ఎప్పటిలాగే మహేష్ ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. మహర్షి తర్వాత మహేష్- పూజా హెగ్డే కలిసినటిస్తోన్న చిత్రమిది. తమన్ సంగీత దర్శకుడు. ఈ కథ రివేంజ్ బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ప్యాన్ ఇండియాగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభంకానుంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ హైదరాబాద్లో ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఫిబ్రవరి రెండవ వారం నుండి సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నాడు మహేష్. మార్చి లోపు ఆ సినిమా పూర్తిచేసి ఏప్రిల్ నుండి త్రివిక్రమ్ (Mahesh-Trivikram) సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఆగస్ట్ నుండి రాజమౌళి సినిమా చేయనున్నారు మహేష్.
Read More: Neha Shetty: తెలుగు సినీ జర్నలిస్టుకు కొత్త హీరోయిన్ చురకలు