ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25లక్షల విరాళం ప్ర‌క‌టించిన మహేష్ బాబు.

December 1, 2021

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25లక్షల విరాళం ప్ర‌క‌టించిన మహేష్ బాబు.
Mahesh Babu Announced 25Lakhs to AP Flood Relief Fund: ఇటీవల వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల‌లో భారీ వర్షాలు బీబత్సం సృష్టించాయి..ఈ వరదలకు భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూర్, కడప జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు పంటలు దెబ్బ తిన్నాయి. రోజంతా కురిసిన వర్షానికి తిరుపతి నగరం నీట మునిగింది. ఈ నేప‌థ్యంలో వరద సహాయక చర్యల నిమిత్తం సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25లక్షల విరాళం ప్రకటించారు.    

ట్రెండింగ్ వార్తలు