ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగార్జున నాసామి రంగ.. ఎప్పుడు ఎక్కడంటే?

February 13, 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగార్జున నాసామి రంగ.. ఎప్పుడు ఎక్కడంటే?

అక్కినేని నాగార్జున ఇటీవల కాలంలో నటించిన ఏ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఈయన చివరిగా బంగార్రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సక్సెస్ అనంతరం నాగార్జున మరో రెండు సినిమాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఈ క్రమంలోనే తాజాగా ఈయన నా సామిరంగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలైన సంగతి తెలిసిందే.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి వారు కూడా నటించారు. ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ఆదరణ సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేశాAరు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారక ప్రకటన తెలియజేశారు. జనవరి 14వ తేదీ థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా తిరిగి ఫిబ్రవరి 17వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుందని తెలిపారు.

ఇలా థియేటర్లలో విడుదలైన నెల రోజులను పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ తో పాటు మిర్న మేనన్, రుక్సర్ థిల్లాన్,నాజర్, రావు రమేష్ వంటి తదితరులు ఈ సినిమాలో నటించారు మరి థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read More: గోవా అందాలతో రకుల్ వెడ్డింగ్ కార్డ్.. వైరల్ అవుతున్న ఫోటో!

ట్రెండింగ్ వార్తలు