11 మంది హీరోలని పరిచయం చేస్తూ మెగా డాటర్ తీస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్.. టైటిల్ గా కమిటీ కుర్రాళ్ళు!

March 27, 2024

11 మంది హీరోలని పరిచయం చేస్తూ మెగా డాటర్ తీస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్.. టైటిల్ గా కమిటీ కుర్రాళ్ళు!

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన తరువాత ఇప్పటివరకు వెబ్ సిరీస్ లు,షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే తీస్తూ వచ్చింది కానీ మొదటిసారి ఒక ఫీచర్ ఫిల్మ్ ని గ్రాండ్ గా తెరకెక్కించబోతుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమాకి గత ఏడాది నవంబర్లోనే పూజా కార్యక్రమాలు జరిగాయి.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెకబోతున్న ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. యదువంశీ ఈ సినిమాకి డైరెక్టర్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే సినిమాతో ఏకంగా 11 మంది హీరోయిన్లు, నలుగురు హీరోయిన్లు ను టాలీవుడ్ కి పరిచయం చేస్తుంది నిహారిక. ప్రసాద్ బెహరా, ఈశ్వర్,మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్..

రఘువరన్, అక్షయ్ శ్రీనివాస్, శివకుమార్ మట్ట తదితరులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాతో సింగర్ అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఒక మనసు సినిమాతో కథానాయకగా వెండితెరకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

మంచు మనోజ్ కథానాయకుడిగా వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో వస్తున్న సినిమా వాట్ ది ఫిష్ సినిమాలో నిహారిక నటిస్తూ ఉండటం విశేషం. ఇందులో ఈమె పాత్ర యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ పేరు అష్టలక్ష్మి. అంతేకాకుండా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో మద్రాస్ కారన్ అనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది నిహారిక.

Read More: ఆదివారం అంటే నాటుకోడి, బీర్లు ఉండాల్సిందేనా.. సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున?

ట్రెండింగ్ వార్తలు