డ్రగ్స్ కేసులో ఇరికించింది వాళ్లే… మొదటిసారి డ్రగ్స్ ఇష్యూ పై స్పందించిన నిహారిక?

March 18, 2024

డ్రగ్స్ కేసులో ఇరికించింది వాళ్లే… మొదటిసారి డ్రగ్స్ ఇష్యూ పై స్పందించిన నిహారిక?

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె సినిమాల పరంగా బిజీ అయ్యారు. నిహారిక తన భర్త నుంచి విడిపోవడానికి ఎన్నో కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

సిని బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఆ కుటుంబానికి కోడలుగా వెళ్లినటువంటి నిహారిక అక్కడ ఉండలేక మనస్పర్ధలతో విడిపోయారని అలాగే ఈమె రాడిసన్ పబ్ కేసులో అరెస్టు కావడంతో గొడవలు వచ్చి విడిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా నిహారిక గతంలో పబ్ లో ఫ్రెండ్స్ తో ఉండగా పోలీసులు రైడ్ చేసి అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ ఇష్యూ గురించి స్పందించని నిహారిక తాజాగా ఈ ఘటనపై స్పందించారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ఈ పబ్ కేసులో నా తప్పు ఏమాత్రం లేదు మీడియా వాళ్ళే పెద్ద ఎత్తున రచ్చ చేసి నన్ను ఇరికించారని ఈమె తెలిపారు. ఆరోజు నేను మా స్కూల్ ఫ్రెండ్స్ ని కలవడం కోసం వెళ్లాను చాలా సంవత్సరాల తర్వాత వారిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో వారిని కలిసి ఇక బిల్ పే చేసి బయటకు వస్తున్నటువంటి తరుణంలో పోలీసులు ఒక్కసారిగా లోపలికి వచ్చి అందరిని కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు.

అప్పటివరకు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు కానీ నేనొక రాంగ్ ప్లేస్ లో ఉన్నానని ఆ తర్వాతే నాకు అర్థమైంది. అక్కడ కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతోనే పోలీస్ రైడ్ జరిగిందని నిహారిక తెలిపారు. ఇక ఈ విషయం మీడియాకు తెలియడంతో పెద్ద ఎత్తున మీడియా రచ్చ చేసిందని, ఈ దెబ్బతో తాను పబ్ వెళ్ళడమే పూర్తిగా మానేశానని నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో తను తప్పు లేకపోయినా తనని మాత్రం హైలెట్ చేశారని ఈమె చెప్పకనే చెప్పేసారు.

Read More: ప్రమాదానికి గురైన సింగర్ మంగ్లీ కారు… ఆందోళనలో ఫాన్స్?

ట్రెండింగ్ వార్తలు