ఈమధ్య ఆ పిచ్చి మరింత ముదురుతుంది..

March 12, 2024

ఈమధ్య ఆ పిచ్చి మరింత ముదురుతుంది..

మెగా డాటర్ నిహారిక ఇటీవల కాలంలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యి అనంతరం హీరోయిన్ గా అడుగు పెట్టారు. నిహారిక హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లారు. కానీ వైవాహిక జీవితంలో ఈమె ఎక్కువ కాలం పాటు కొనసాగలేక భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా ఒంటరిగా గడుపుతున్నటువంటి నిహారిక తన ఫోకస్ మొత్తం కెరియర్ పైన పెట్టింది .వరుసగా సినిమాలలో వెబ్ సిరీస్ లలోను నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారిపోయారు. అంతేకాకుండా ఆహాలో ప్రసారమవుతున్నటువంటి కుకింగ్ షో వ్యాఖ్యాతగా కూడా నిహారిక వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె తాజా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

నిహారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇటీవల కాలంలో నాకు తిండి పిచ్చి మరింత ఎక్కువైందని ఈమె తెలిపారు. పప్పుచారు నా ఫేవరెట్ అంటూ చెప్పుకోవచ్చారు. ఇక ఇటీవల కాలంలో తాను డబ్బుకూడ పెట్టుకొని మరీ వెకేషన్ కు వెళ్తున్నానని తెలియజేశారు. ఇక నేను ఏదైనా చేయాలి అంటే ముందుగా ఆలోచించి ప్లాన్ వేసి పనులు చేయనని నాకు అప్పటికి ఏది అనిపిస్తే ఆ పని చేస్తూ ఉంటానని నిహారిక వెల్లడించారు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ నాకు నటన అంటే చాలా ఇష్టం హీరోయిన్గా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అయితే ఇప్పటివరకు నాకు ఒక కమర్షియల్ సినిమాలో కూడా అవకాశం రాలేదు. అయితే ఇలాంటి సినిమాలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. ఇక తన కుకింగ్ షో గురించి మాట్లాడుతూ ఎలాగైనా ఈ కార్యక్రమానికి నానమ్మతో పాటు పెద్దమ్మ ఉపాసన వదినను తీసుకువచ్చి వారి చేత వంట చేయించాలని చూస్తున్నాను అంటూ నిహారిక చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More :  ప్రేక్షకుల చేతులు మీదుగా మారుతీ నగర్‌ సుబ్రమణ్యం పోస్టర్‌ విడుదల  

ట్రెండింగ్ వార్తలు