నేను చనిపోయిన రోజున నా కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూస్తా: ఎన్టీఆర్

March 19, 2024

నేను చనిపోయిన రోజున నా కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూస్తా: ఎన్టీఆర్

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మనం మరొక నిమిషానికి ఉంటామో లేదో కూడా తెలియని బ్రతుకులు మనవి. చావు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకే ఉన్నని రోజులు చాలా సంతోషంగా ఉండాలని అందరితో మంచిగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ నా కుటుంబం ఇద్దరిని ప్రమాదంలో తీసుకెళ్లి పోయింది. అలా వాళ్ళు చనిపోయిన రోజుకు వారి జీవితం చాలా ఉంది ఇంకా వాళ్ల జీవితంలో ఎన్నో చూడాల్సిన సంఘటనలు సన్నివేశాలు ఉన్నాయి కానీ అవేవీ తీరకుండా వాళ్లు వెళ్లిపోయారు. ఆరోజు నేను నా మనసులో ఒకటి నిర్ణయం తీసుకున్నానని తారక్ తెలిపారు.

నేను చనిపోయే రోజుకు నా కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు ఈ జీవితంలో నేను అన్ని చూసేసాను నాకు చావు ఇప్పుడే వచ్చిన పరవాలేదు అన్న ధీమాతో చనిపోవాలి కానీ నేను చనిపోయే టప్పుడు నేను ఇంకా చాలా చూడాలి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారు వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచనలు కలగకూడదని ఈయన తెలిపారు.

ఇలాంటి ఆలోచనలు నాకు కానీ నా భార్య పిల్లలకు కానీ రాకూడదు మా నాన్న ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదనే ఆలోచన వాళ్ళకి ఎప్పటికీ రాకూడదు. అందుకే నేను చనిపోయే లేపు నా పిల్లలకు కావాల్సిన సెటిల్మెంట్స్ చేస్తాను నేను లేకపోయినా నా భార్య ఏ క్షణం బాధపడకుండా ఉండేలా చేసేలా నిర్ణయం తీసుకుంటాను నేను మాత్రమే కాదు నన్ను ప్రేమించే మీరందరూ కూడా మీ కుటుంబం కోసం ఇలాగే చేయండి ఇదివరకు చేయకపోయినా ఇప్పటినుంచి మీ ప్రయాణం ఇదే దిశగా అడుగులు వేయండి అంటూ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మహానటి సినిమాకు కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్.. అవసరాల శ్రీనివాస్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు