January 29, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజి. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే OG నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఎంతటి సెన్సేషన్ ను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు పవన్ సినిమాల్లో బెస్ట్ గ్లింప్స్ అని నెటిజన్లు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇప్పటికే 70-75 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే ఓజి ఓవర్సిస్ రైట్స్ 18కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక దీంతో పాటు OGకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. OG ఆడియో రైట్స్ ని సోనీ సంస్థ దక్కించుకుంది. 20 కోట్ల డీల్ తో OG ఆడియో రైట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ఒక సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు షూటింగ్ కూడా పూర్తిచేసుకొని OG.. ఈ రేంజ్ లో ఓవర్సిస్, ఆడియో రైట్స్ అమ్ముడుపోవడం ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో ప్రస్తుతం పవన్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. అయితే ఓజీ సినిమాకి సంబంధించి పవన్ కల్యాణ్ ఇంకో 20 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. దీని కోసం ఎన్నికల తర్వాత రెండు షెడ్యూల్స్ కేటాయించాడట పవన్.
Read More: కౌంట్డౌన్ మొదలు పెట్టిన పుష్పరాజ్…దేశవ్యాప్తంగా ట్రెండింగ్