January 26, 2022
పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత లవర్బాయ్ పాత్రలో నటించారు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ ప్యాన్ ఇండియా సినిమా వాయిదా పడింది. అప్పటి నుండి ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొని ఉంది.
అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లుకొడుతోంది. ‘రాధేశ్యామ్’ని ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందని.. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్, జీ5 నుంచి ‘రాధేశ్యామ్’కు భారీ ఆఫర్ వచ్చిందని.. టీమ్ కూడా అందుకు సుముఖంగా ఉందని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.