యాగంటి క్షేత్రంలో పుష్ప 2 షూటింగ్.. జనసంద్రంగా మారిన యాగంటి?

March 20, 2024

యాగంటి క్షేత్రంలో పుష్ప 2 షూటింగ్.. జనసంద్రంగా మారిన యాగంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించినటువంటి పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున షూటింగ్ పనులను జరుపుతూ సినిమాని పూర్తి చేసే ఆలోచనలలో ఉన్నారు.

ఇక ఇటీవల పలు ప్రాంతాలలో షూటింగ్ పనులను జరుపుకున్నటువంటి చిత్ర బృందం ప్రస్తుతం నంద్యాల బనగానపల్లె వద్ద ఉన్నటువంటి యాగంటి క్షేత్రంలో ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. నేడు ఈ క్షేత్రంలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఇక్కడ పుష్ప 2 షూటింగ్ జరుగుతుందనే విషయం తెలియడంతో ఒక్కసారిగా షూటింగ్ చూడటం కోసం జనాలు తరలివచ్చారు.

ఇక యాగంటి క్షేత్రంలో గుహలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది. ఈ గుహలో ఉన్నటువంటి స్వామివారికి రష్మిక బంగారు కిరీటాన్ని అందించే సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇక ఈ షూటింగ్ రెండు రోజుల నుంచి ఇక్కడే జరుగుతున్న సంగతి తెలిసిందే.

పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read More: భారీ ధరకు గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్.. కైవసం చేసుకున్న ప్రముఖ సంస్థ!

ట్రెండింగ్ వార్తలు