పెళ్లి జరిగితే పద్ధతిగా ఉండాలా.. మగవాళ్లను ఎందుకు ప్రశ్నించరు: రకుల్

March 22, 2024

పెళ్లి జరిగితే పద్ధతిగా ఉండాలా.. మగవాళ్లను ఎందుకు ప్రశ్నించరు: రకుల్

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా ఎంతో బిజీగా గడిపినటువంటి రకుల్ ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె నటుడు జాకీ భగ్నానిని ప్రేమించి ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ గోవాలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఈమె తన భర్తతో కలిసి పలు కార్యక్రమాలకు వెళుతూ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా రకుల్ హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. ఇలా పెళ్లి తర్వాత కూడా ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేయడంతో పలు ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ కి ఇదే ప్రశ్న ఎదురయింది. పెళ్లి తర్వాత మీ ఇంట్లో మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోమని సలహా ఇవ్వలేదా అనే ప్రశ్న ఎదురు కాగా ఈ ప్రశ్నకు ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. నాకు ఎవరూ అలాంటి సలహాలు ఇవ్వలేదని తెలిపారు. నాకు పుట్టింట్లో ఎంత స్వేచ్ఛ వుందో అత్తగారింట్లో కూడా అంతే స్వేచ్ఛ ఇచ్చారని ఈమె తెలిపారు.

అసలు పెళ్లి అనే విషయాన్ని అందరూ చాలా పెద్దదిగా చూస్తున్నారని కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని తెలిపారు. ఇక పెళ్లి అయితే పద్ధతులు మార్చుకోవాలా అంటూ కూడా ఈమె ప్రశ్నించారు. పెళ్లి తర్వాత పద్ధతిగా ఉండాలని కేవలం ఆడవాళ్లకు మాత్రమే వర్తిస్తాయా.. మగవాళ్ళను ఇదే విధంగా ఎందుకు ప్రశ్నించరు. పెళ్లి తర్వాత మగవాళ్ళు కూడా దగదగా మెరిసే శార్వాని వేసుకోవచ్చు కదా అంటూ ఘాటుగానే సమాధానం చెప్పారు. ఇలా రకుల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న..ఈ సినిమాలు పట్టాలెక్కేది ఎప్పుడో!

ట్రెండింగ్ వార్తలు