September 5, 2022
ఐదేళ్ల క్రితం వచ్చిన ‘రాజుగారి గది 2’ చిత్రంలో ప్రతీకారం తీర్చుకునే ప్రేతాత్మగా సమంత నటించి మెప్పించారు. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున, శీరత్కపూర్ ఇతర ప్రధాన తారలు. అయితే సమంత మరోసారి భూతంగా కనిపించనుందని తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీమేన్ 2’ వెబ్సిరీస్తో సమంత హిందీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు హిందీ ఆఫర్లు చాలా వస్తున్నాయి. కానీ సమంత చేయబోయే తొలి చిత్రం ఆయుష్మాన్ ఖురానాతో ఉంటుందన్నది బాలీవుడ్ టాక్. రాజ్కుమార్రావుతో ‘స్త్రీ’వంటి వందకోట్ల హిట్ ఫిల్మ్ తీసిన అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.
రాజస్థాన్ నేపథ్యంలో సాగే కథలో సమంత డ్యూయెల్ రోల్ చేస్తారని, అందులో ఓ పాత్ర రాణిగా అయితే మరో పాత్ర భూతంగా అని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అలాగే బాలీవుడ్లో అక్షయ్కుమార్తో సమంత ఓ పీరియాడికల్ ఫిల్మ్ చేయనున్నారని, రణ్వీర్సింగ్తో కమర్షియల్ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారనే టాక్ బీటౌన్లో వినిపిస్తోంది.
‘ది ఫ్యామిలీమేన్ 2’ తర్వాత రాజ్ అండ్ డీకేలతో సమంత ఓ వెబ్సిరస్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో రూసో బ్రదర్స్ తీసిన ‘సియోడల్’ (తెలుగులో ‘కోట’) అనే ఇంగ్లీష్ వెబ్సిరీస్ను హిందీలో తీస్తున్నారు. వరుణ్ ధావన్ మెయిల్ మెయిన్ లీడ్ పాత్రలో కనిపిస్తారు. సమంత ఓ లీడ్ రోల్ చేస్తారు. ఈ సినిమా కోసమే సమంత మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు.
ఇక సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’, సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సమంత ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని చిలుకూరు లోకేషన్స్లో జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబరు 23న రిలీజ్ అనుకుంటున్నారు కానీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి సినిమాలను తీసిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు.