March 18, 2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. ఈమె మయోసైటిసిస్ వ్యాధికి గురి కావడంతోనే ఇలా సినిమాలకు విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే .అయితే సమంతకు ఈ వ్యాధి వచ్చిన తర్వాత తాను నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన ఇబ్బందులను బయటపెడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత కన్నీళ్లు పెట్టుకోవడంతో సోషల్ మీడియా వేదికగా ఈమె పై భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. సమంత ఏడుస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సింపతి క్వీన్ అంటూ ఆమెకు బిరుదు ఇచ్చారు..
ఇలా తన బాధను అర్థం చేసుకోకుండా ఆమెను సింపతి క్వీన్ అనడంతో ఈ ట్రోల్స్ పై సమంత స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో పట్ల చాలామంది ట్రోల్స్ చేశారు. అవి చూసి నాకు చాలా బాధనిపించిందని ఈమె తెలిపారు.అయితే నేను ఆ క్షణం పడిన బాధ నొప్పి అనేవి నాకు మాత్రమే తెలుస్తాయని ఈమె తెలిపారు.
మయోసైటీస్ వ్యాధి ఉంది అని నేను మీకు చెప్పకపోయి ఉంటే ఇంకా ఇంకా నన్ను ట్రోల్ చేస్తుండేవారు .. నా బాధ గురించి ఆలోచించకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి నేను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం సమంత ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రస్తుతం కథలను వినే పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈమె చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Read More: ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే జగపతిబాబు అలా స్థిరపడేవారా.. అసలు విషయం చెప్పిన నటుడు?