ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి.. అందుకే ఇది నాకు ప్రత్యేకం: సమంత

March 25, 2024

ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి.. అందుకే ఇది నాకు ప్రత్యేకం: సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ఇటీవల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమెకు మయోసైటిసిస్ వ్యాధి రావడంతో ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇలా ఈ చికిత్సలో భాగంగా ఈమె కోలుకున్నారని తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి సమంత తన పాడ్ కాస్ట్ ద్వారా సిటాడెల్ వెబ్ సిరీస్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సిరీస్ నీ గురించి సమంత మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చీకటి రోజులో ఉంటాయి. ఆ చీకటి రోజులను భరిస్తే తర్వాత కెరియర్ బాగుంటుందని ఈమె తెలిపారు. అలా నా జీవితంలో కూడా చీకటి రోజులు ఉన్నాయని వెల్లడించారు. మయోసైటిసిస్ కారణంగా తాను ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యాను. రోజు రోజుకు ఈ వ్యాధిని మానసికంగా శారీరకంగా బలహీనంగా చేసింది.

ఈ వ్యాధితో బాధపడుతున్న సమయంలోనే తాను సిటాడెల్ వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యానని తెలిపారు. ఇందులో శారీరక శ్రమతో కూడినటువంటి సన్నివేశాలు ఉన్నాయని తెలిసిన కమిట్ అయ్యానని ఒకరోజు ఈ సినిమా షూటింగ్లో భాగంగా తాను చాలా బలహీనంగా మారిపోయి స్పృహ తప్పి పడిపోయానని ఈమె తెలిపారు. ఆ సమయంలో టీమంతా కంగారు పడ్డారని సమంత వెల్లడించారు.

ఇలా ఈ సిరీస్ కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు అందుకే నా కెరియర్ లో ఈ సిరీస్ చాలా ప్రత్యేక అంటూ సమంత ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సిరీస్ లో సమంత సరసన వరుణ్ ధావన్ నటించారు.

Read More: నా తప్పు లేకపోయినా నాగార్జున నన్ను తిట్టారు.. జేడి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు! 

ట్రెండింగ్ వార్తలు