July 5, 2022
దక్షిణాదిలో సూపర్హిట్ కథానాయికగా పేరు తెచ్చుకున్న సమంత తన ఫోకస్ను ప్రజెంట్ బాలీవుడ్పై పెట్టింది. సమంత బాలీవుడ్లో ఎప్పట్నుంచో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందుకు తగ్గ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి తగ్గ వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ సమంత బాలీవుడ్లో ఏ హీరోతో యాక్ట్ చేయనున్నారో అన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ఖురానాతో సమంత ఓ సినిమా చేయనున్నారు. దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలో ఇద్దరు దక్షిణాది నటీనటులు కూడా ఉన్నారట. ఇక దర్శకుడి పేరు ఫైనల్ కావాల్సి ఉంది.
అలాగే సమంత ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్కు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఆయుష్మాన్ ఖురానాతో సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత సమంత ఈ సినిమాను టేకాఫ్ చేస్తారు. ఈ చిత్రంలో అక్షయ్కుమార్ లేదా వరుణ్ ధావణ్ హీరోలుగా నటించే చాన్సెస్ ఉన్నాయట. మరోవైపు తాప్సీ ప్రొడక్షన్ హౌస్ అవుట్ సైడర్ ఫిలింస్లో ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయడానికి సమంత ఒకే అన్నారు. ఇలా ఒకేసారి సమంత మూడు ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్లోనే కాదు ఇటు సౌత్ ఇండస్ట్రీ సర్కిల్స్లో నూ ఓ హాట్టాపిక్గా మారింది.
ఇక సమంత నటించిన తాజా చిత్రాలు ‘శాకుంతలం’, యశోద లు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఖుషి’ చిత్రంతో సమంత బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో.