February 8, 2024
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లు ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకురాగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇక చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2021 డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తదుపరి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా రాబోతుంది అంటూ బోయపాటి గతంలోనే వెల్లడించారు అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని వార్తలు రావడంతో ఈ సినిమా అఖండ సీక్వెల్ చిత్రమేనా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శీను రామ్ హీరోగా నటించిన స్కంద సినిమా తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన అల్లు అర్జున్ సూర్య వంటి హీరోలతో సినిమా చేయాలని భావించారు కానీ ఇప్పుడు ఇద్దరి హీరోలు కూడా వారి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బోయపాటి మరోసారి బాలయ్యతో కలిసి సినిమా విషయం గురించి చర్చలు జరిపారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వైరల్ గా మారడంతో కచ్చితంగా వీరిద్దరూ అక్కడ సీక్వెల్ చిత్రమే ప్లాన్ చేస్తున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు.
మరి బోయపాటి బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న సినిమా నిజంగానే అఖండ సీక్వెల్ రాబోతున్న లేకపోతే కొత్త సినిమాని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న సందేహాలు కూడా అందరిలోనూ ఉన్నాయి. అఖండ సినిమాలో ద్విపాత్రాభినయంలో బాలయ్య ఎంతో అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ సీక్వెల్ అనగానే ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
Read More: ప్రభాస్ కి జోడిగా రష్మిక.. హిట్ గ్యారెంటీనా?