పవన్ కళ్యాణ్ ఓజీ ఎప్పటికీ మాదే.. క్లారిటీ ఇచ్చిన డివివి!

January 10, 2024

పవన్ కళ్యాణ్ ఓజీ ఎప్పటికీ మాదే.. క్లారిటీ ఇచ్చిన డివివి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. దీంతో ఈయన కమిట్ అయినటువంటి సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ సినిమాలన్నీ కూడా ఎన్నికల తర్వాతనే షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నాయని తెలుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ షూటింగ్ మధ్యలో ఆగిపోయినటువంటి సినిమాలలో ఓజీ సినిమా ఒకటి. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఈ సినిమా దాదాపు సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనకుండా కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఎన్నికలపై దృష్టి సాధించి ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడటంతో ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని డివివి బ్యానర్స్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమా నిర్మాతల చేతులు మారాయి అంటూ ఈ నిర్మాణ సంస్థ పై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

డీవీవి చేతులలో నుంచి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మరొక నిర్మాణ సంస్థ చేతికి వెళ్లింది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలకు ఎక్కడ ఆజ్యం పడింది అనే విషయం తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో డివివి నిర్మాణ సంస్థ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓజీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా మాదేనని ఎప్పటికీ మాదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఏ నిర్మాతల చేతిలోకి వెళ్లలేదని ఈ సినిమాని మేమే నిర్మిస్తున్నాము అంటూ నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని క్లారిటీగా తెలియచేయడమే కాకుండా మరొక ట్వీట్ కూడా చేశారు. The hunger will be for a longer time, but the Cheetah hunt will leave nothing behind. అంటూ ఓ కొటేషన్‌తో తమ ట్వీట్‌ను ఎండ్ చేసింది. ఓజీ గ్లింప్స్‌ను కూడా మరో సారి షేర చేసింది డీవీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు సృష్టిస్తున్న గుంటూరు కారం!

ట్రెండింగ్ వార్తలు