January 25, 2024
రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాలో జోయాగా నటించి ప్రేక్షకులను అలరించింది త్రిప్తి డిమ్రి. బాలీవుడ్లో అప్పటికే కొన్ని చిత్రాల్లో నటించినప్పటకీ యానిమల్ చిత్రంతో ఆమె ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ‘యానిమల్’ తర్వాత త్రిప్తికి ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. తెలుగులోనూ ఆమె వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్లో హీరోయిన్గా త్రిప్తిని పరిశీలిస్తున్నారు. అలాగే రవితేజతో ఓ ప్రాజెక్ట్ కూడా చర్చల దశలో ఉంది.
ఇటీవల డిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న త్రిప్తి ‘యానిమల్’ సక్సెస్పై ఆనందం వ్యక్తం చేపింది. కెరీర్ విషయంలో ఎప్పుడూ బాధపడలేదంటూనే మరిన్ని విషయాలని పంచుకుంది. సినీ పరిశ్రమలో ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్ అండ్ డౌన్స్ సహజమే. ప్రతిదాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ‘యానిమల్`తో మంచి పాపులారిటీ లభించింది. సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే అనుకున్నాం. కానీ, నా పాత్రకు ఇంతటి పాపులారిటీ వస్తుందని అస్సలు అనుకోలేదు. ప్రేక్షకులు నాపై చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.. రోజూ నిద్రపోయే ముందు చిత్ర బృందాన్ని గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెబుతున్నా. నా జీవితంలో ప్రత్యేకమైన క్షణాలివి. జోయాగా నటించినందుకు అదృష్టంగా భావిస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.