January 25, 2024
సీరియల్స్ నుంచి సినిమాలోకి వచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నప్పటికీ షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం`తో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ సినిమాలో `సీత పాత్రలో ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం తెలుగులో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్లో నటిస్తూ ఆ పాత్రలకు వన్నె తెస్తుంది. ‘సీతారామం’లో సీతగా మురిపించిన ఈ అమ్మడు.. ఇటీవల ‘హాయ్ నాన్న’లో యష్నగా అలరించింది. మృణాల్ ఇటీవల ఓ ఇంటర్యూయర్ అడిగిన ప్రశ్నకి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నారు? అని అడగగా తనదైన శైలిలో బదులిచ్చింది మృణాల్.
నటిగా ముఖానికి రంగేసుకున్నప్పటి నుంచి నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే. మృణాల్గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకోకున్నా.. నా పాత్రలతో వాళ్ల మదిపై చెరగని ముద్ర వేయాలి అనుకున్నా.. నా కథలు, పాత్రల ఎంపికలో నాకు స్ఫూర్తినిచ్చేది అదే. ఓసారి `సీత`గా పేరు తెచ్చుకుంటే.. తదుపరి సినిమాతో ఆ పేరును మరిపించే మరో పాత్ర చేయాలనుకుంటా. అలాంటి కథను, పాత్రను వెతికి పట్టుకోవడం కోసం సహనంతో ఎదురు చూస్తుంటా. తొందరపడి ఏది పడితే అది చేసి తప్పు చేయాలనైతే అసలు అనుకోను. నేనెన్ని చిత్రాలు చేశానన్న దాని కన్నా.. ఎన్ని పాత్రలు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచాయన్నదే నాకు ముఖ్యం” అని చెప్పుకొచ్చింది మృణాల్.
ఆమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీస్టార్’లో నటిస్తోంది. అలాగే చిరంజీవి ‘విశ్వంభర’లో కనిపించనున్నట్లు ఇన్సైడ్ టాక్…
Read More: Arrangements of Love: సమంత ప్లేసులో శృతి హాసన్..లెస్బియన్ పాత్రతో సాహసం