రాజుల కాలం కాదు…లేకపోతే ఏ రాజో ఎత్తుకుపోయేవాడు!

February 9, 2024

రాజుల కాలం కాదు…లేకపోతే ఏ రాజో ఎత్తుకుపోయేవాడు!

అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం సినిమాలలో కూడా మెల్లిమెల్లిగా అవకాశాలను అందుకున్నారు. ఇలా సినిమాల పరంగా ఈమె ఎంతో బిజీగా మారడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా గుడ్ బై చెప్పేసారు.

ఇలా వెండితెరపై వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అనసూయ కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు అలాగే ఈమె షేర్ చేస్తే ఫోటోల వల్ల భారీ స్థాయిలో నెగిటివిటీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.

ఇలా తన గురించి సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వారి పట్ల ఈమె కూడా తన స్టైల్ లోనే వారికి కౌంటర్ ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇలా అభిమానులతో ఎంత వివాదం జరిగినా ఈమె మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ ధరించి సరికొత్త లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అనసూయ ఈ ఫోటోలకు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజుల కాలం కాదు కాబట్టి రథము గుర్రాలు లేవు లేకపోతే ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు. నీకోసం మరో తాజ్ మహల్ ఉండేదేమో అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ త్వరలోనే రాజకార్, పుష్ప 2 వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Read More: ఇండస్ట్రీలో ఉంటూ భారీగానే ఆస్తులు వెనకేసిన త్రిష!

ట్రెండింగ్ వార్తలు