రణ్‌బీర్ కపూర్, ఫ్యామిలీ మీద కేసు..మండిపడ్డ బోల్డ్ బ్యూటీ

December 28, 2023

రణ్‌బీర్ కపూర్, ఫ్యామిలీ మీద కేసు..మండిపడ్డ బోల్డ్ బ్యూటీ

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) అలియా జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగుతూ ఉన్నారు. ఇక అలియా ఇది వరకే టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక రణబీర్ ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రణబీర్ కపూర్ అలియా జంటపై పోలీస్ కేసు నమోదు అయింది.

అలియా భట్ రణబీర్(Ranbir Kapoor) ఇద్దరు కూడా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వీరీ ఫ్యామిలీతో కలిసి ఒకే చోట సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకలలో భాగంగా కేక్ మీద వైన్ పోసి పెద్ద ఎత్తున మంట పెడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు.ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా వాడడంతో పలువురు వీరిపై పోలీస్ కేసు నమోదు చేయాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు వీరందరూ కలిసి క్రైస్తవ మతస్తుల నమ్మకాలను బాధపెట్టారు అంటూ వీరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.

ఇలా కపూర్ ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి క్రిస్మస్ వేడుకలను సరదాగా జరుపుకున్నటువంటి తరుణంలో వీరిపై పోలీస్ కేసు అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై బోల్డ్ బ్యూటీ ఉర్సి జావేద్ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఈమె స్పందిస్తూ ఇక ఆపుతారా వారు చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ఈమె తన స్టైల్ లో ఈ ఘటనపై స్పందిస్తూ కపూర్ ఫ్యామిలీకి మద్దతు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది

Read MorePragathi: ప్రగతి ఇంట్లో ప్రత్యేక పూజలు? కారణం అదేనా? 

ట్రెండింగ్ వార్తలు