తలైవాతో మన్మధుడు.. అంచనాలు పెంచేస్తున్న లోకేష్?

April 22, 2024

తలైవాతో మన్మధుడు.. అంచనాలు పెంచేస్తున్న లోకేష్?

తలైవా రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి విజయం కావడంతో తదుపరి ఈయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా రజినీకాంత్ 171వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవల లోకేష్ కనగరాజ్ విక్రమ్, లియో వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ తరుణంలోనే రజినీకాంత్ లోకేష్ సినిమా అంటే అభిమానులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీలు కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రజనీకాంత్ కుమార్తె పాత్రలో శృతిహాసన్ ఈ సినిమాలో ఎంపికైన విషయం మనకు తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కూడా భాగం కాబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇటీవల డైరెక్టర్ లోకేష్ నాగార్జునతో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా నాగార్జునతో లోకేష్ బేటి కావడంతో బహుశా రజనీకాంత్ సినిమా కోసమే ఆయనని సంప్రదించారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నటించడానికి నాగార్జున కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని త్వరలోనే నాగార్జున పాత్రకు సంబంధించిన ఈ విషయాలన్నింటినీ కూడా అధికారకంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించినటువంటి సినిమాలో నటిస్తున్నారు.

Read More: కల్కి నుంచి అదిరిపోయే అప్డేట్.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్.. వీడియో వైరల్?

ట్రెండింగ్ వార్తలు