సిద్దు మీదకి ఎక్కిన అనుపమ.. కొత్త పోస్టర్ వైరల్!

January 1, 2024

సిద్దు మీదకి ఎక్కిన అనుపమ.. కొత్త పోస్టర్ వైరల్!

Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డీజే టిల్లు. చిన్న చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎటువంటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు మూవీ భారీ విజయం అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక డీజే టిల్లు సినిమా తర్వాత హీరో సిద్ధు జొన్నలగడ్డని అభిమానులు ముద్దుగా డీజే టిల్లు అని పిలవడం మొదలుపెట్టారు. ఇంకొందరు అయితే రాధిక అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

టిల్లు స్క్వేర్(Tillu Square) అనే టైటిల్ తో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా 2024 ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇక డీజే టిల్లు సీక్వెల్ సినిమా లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటిస్తున్న విషయం తెలిసిందే. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటికే అనుపమ అలాగే సిద్దు జొన్నలగడ్డ కు సంబంధించిన పలు పోస్టర్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా ఈ సినిమాకు సంబంధించిన మరొక పోస్టర్ నీ అనుపమ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అనుపమ సిద్దు జొన్నలగడ్డపై కూర్చుంది. అంతేకాకుండా రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది. ఇక సిద్దు జొన్నలగడ్డ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ విధంగానే ఉండడంతో ఇది ఒక రొమాంటిక్ సన్నివేషంలో తీసినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరగా మారింది.

న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు బిగ్ సర్ప్రై ఇస్తూ ఈ సినిమా నుంచి పోస్టర్ ని విడుదల చేసింది అనుపమ. అయితే మొదటి నుంచి రొమాంటిక్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో మాత్రం రొమాన్స్ తో రెచ్చిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అనుపమ అభిమానులు అలాగే సిద్దు జొన్నలగడ్డ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read More: హనుమాన్ గా చిరంజీవి?.. ఊరిస్తున్న ప్రశాంత్ వర్మ

ట్రెండింగ్ వార్తలు